అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లాలో అనుమానస్పద స్థితిలో రెండు చిరుతలు మృతి చెందడం కలకలం రేపింది. మడకశిర మండలం మెలవాయి శివారులో చిరుత మృతదేహం కనిపించింది. నిన్న కూడా అటవీ అధికారులు ఒక చిరుత మృతదేహాన్ని గుర్తించారు. నోటి నుంచి తెల్లటి నురగతో ఓ రైతు పొలంలో చిరుత మృతదేహం కనిపించింది.
ఎలుకల కోసం పెట్టిన రసాయనాలు తిని చనిపోయి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. అనుమానస్పద స్థితిలో ఒక ఆడ చిరుత, ఒక మగ చిరుత ఒకే విధంగా మరణించాయని DFO రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇవి రెండు సంవత్సరాల వయసు ఉంటాయి అని అన్నారు.