Home   »  ఆంధ్రప్రదేశ్   »   పరువు నష్టం కేసు వేస్తారా..విమర్శిస్తే?: పోసాని

పరువు నష్టం కేసు వేస్తారా..విమర్శిస్తే?: పోసాని

schedule raju

ఆంధ్రప్రదేశ్: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్ష కట్టారని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తనపై రూ.4 కోట్ల పరువు నష్టం దావా వేశారని తెలిపారు. నారా లోకేశ్‌ ఎవరిపై విమర్శలు చేయలేదా? అని ప్రశ్నించారు. సీఎంజగన్‌పై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన లోకేశ్‌పై తాను పరువు నష్టం కేసు వేస్తే కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు.

లోకేశ్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, పరువు నష్టం దావా కేసులో తాను కోర్టుకు హాజరయ్యే సమయాల్లో తనను హత్య చేయాలని భావిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. తాను చనిపోతే అందుకు లోకేశ్‌దే బాధ్యత అన్నారు. లోకేశ్ అంటే చాలామంది ఉంటారని… చంద్రబాబు, భువనేశ్వరిల తనయుడు, బ్రాహ్మణి భర్త లోకేశ్ కారణమవుతాడన్నారు.