Home   »  ఆంధ్రప్రదేశ్   »   TDPలో చేరిన YCP MLA కొలుసు పార్థసారథి..!

TDPలో చేరిన YCP MLA కొలుసు పార్థసారథి..!

schedule mahesh
ycp-mla-kolusu-parthasarathy-joined-the-tdp!

Kolusu Parthasarathy | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయలు వేగంగా మారుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నుంచి తెలుగుదేశం పార్టీ (TDP) లోకి రాజకీయ నాయకుల వలసలు ఊపందుకున్నాయి.

నారా లోకేష్ సమక్షంలో TDPలో చేరిన Kolusu Parthasarathy

తాజాగా ఈరోజు పెనమలూరు MLA కొలుసు పార్థసారథి TDPలో చేరారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో చేరిక కార్యక్రమం జరిగింది. పార్థసారధికి లోకేష్ కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పార్థసారథితో పాటు TDP నేతలు కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్ తదితరులున్నారు.

TDPలో చేరిన విజయవాడ నగర YSRCP అధ్యక్షుడు భవకుమార్‌

అలాగే, విజయవాడ నగర YSRCP అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ కూడా నారా లోకేశ్‌ సమక్షంలో TDP లో చేరారు. లోకేష్, భవకుమార్‌కు కండువా కప్పి పార్టీ శ్రేణులతో సాదరంగా ఆహ్వానించారు. అంతేకాకుండా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కూడా తన అనుచరులతో కలిసి TDP లో చేరారు.

Also Read | చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగిన TDP కార్యకర్తలు..!