Home   »  ఆంధ్రప్రదేశ్   »   గిరిజన విశ్వవిద్యాలయనికి YS జగన్ శంకుస్థాపన

గిరిజన విశ్వవిద్యాలయనికి YS జగన్ శంకుస్థాపన

schedule sirisha

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ఉదయం (శుక్రవారం) కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయనికి శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలోని మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో యూనివర్సిటీ విస్తరించనుంది.

ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ, పేదల ఇళ్లకు 20 వేల కోట్లు, రూ.1 కోటితో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2,000 కోట్లతో రాయపూర్ నుంచి విశాఖ వరకు ఆరు లైన్ల రహదారిని నిర్మిస్తున్నామని తెలిపారు. తమ పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.