Home   »  టెక్నాలజీవార్తలు   »   వైద్య విద్యార్థిని కాకినాడ రైల్వే స్టేషన్లో దుర్మరణం

వైద్య విద్యార్థిని కాకినాడ రైల్వే స్టేషన్లో దుర్మరణం

schedule mounika

కాకినాడ లో ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడి వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైన ఘటన గురువారం ఉదయం కాకినాడ రైల్వే స్టేషన్లో జరిగింది. కాకినాడ జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం. విజయవాడకు చెందిన ఎస్. సత్య తనూష (24) గుంటూరు జిల్లా ఎన్ఆర్ఎ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు సదస్సు ఉండటంతో పాల్గొనేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్ప్రెస్లో కాకినాడ చేరుకుంది. రెండో నంబరు ప్లాట్ఫాం వద్ద రైలు దిగేందుకు సిద్ధమవుతుండగా పట్టాలపై పడిపోయింది. రైలు పోర్టు రైల్వేస్టేషన్ వైపు నెమ్మదిగా కదలడంతో వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, ప్రయాణికులు చైన్ లాగారు . వెంటనే రైలు ఆగినప్పటికీ.. అప్పటికే ప్లాట్ఫాం, రైలు చక్రాల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.