ఢిల్లీ: భారత ప్రభుత్వం బల్క్ సిమ్ కార్డుల విక్రయం నిషేదించింది. టెలికాం రంగంలోని మోసాలను గుర్తించడానికి కొత్త నిబంధనలను అమలు చేసింది. ఇందులో సిమ్ కార్డ్ డీలర్లు పోలీసు ధృవీకరణ అనుమతులని తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త ఆదేశాల ప్రకారం అనధికార వ్యక్తులు పరిశ్రమలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు, SIM CARD అమ్మకాలతో సంబంధం ఉన్నవారు మోసం లేదా నేరలకి పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవడనికి నిర్ణయించారు.
అంతేకాకుండా తప్పుడు గుర్తింపులను సృష్టించడం, మోసపూరిత లావాదేవీలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తరచుగా ఉపయోగించే మాస్ కనెక్షన్లను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తుంది.