Home   »  వ్యాపారం   »   వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

schedule mahesh

Markets ended with gains | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల్లో కొనసాగినప్పటికీ కొనుగోళ్ళ మద్దతుతో ఎట్టకేలకు మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 227 పాయింట్లు లాభపడి 72,050 వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 21,911 వద్ద స్థిరపడింది.

markets-ended-with-gains-for-the-third-day

నేడు పేటీఎం షేర్ మరో 5 శాతం క్షీణించి రూ. 325.05 వద్ద ముగిసింది. ఈ కంపెనీ షేర్లు రోజురోజుకు దారుణంగా పడిపోతుంటే, ఈ సంస్థ లోయర్ సర్క్యూట్ లిమిట్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు 20 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం జరిగింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.04గా వుంది.

BSEసెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (6.51%), NTPC (3.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.46%), HDFC బ్యాంక్ (2.15%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.11%), ITC (-1.85%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.58%), నెస్లే (-1.32%), సన్ ఫార్మా (-0.79%).

Also Read | AI సాధనాలతో హ్యాకర్లను పట్టుకున్న మైక్రోసాఫ్ట్..!