JEE Main Exam | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యొక్క ఇటీవలి ప్రకటన ప్రకారం.. JEE మెయిన్ 2024 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో 23 మంది అభ్యర్థులు 100 శాతం స్కోర్ను సాధించారు. తాజాగా, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్-1 పరీక్షల ఫలితాలను సోమవారం ప్రకటించింది.
ప్రధానాంశాలు
JEE Main Exam | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ఇటీవలి ప్రకటన ప్రకారం.. JEE మెయిన్ 2024 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో 23 మంది అభ్యర్థులు 100 శాతం స్కోర్ను సాధించారు. ముఖ్యంగా, ఈ 100 శాతం స్కోర్ను సాధించిన వారిలో గణనీయమైన సంఖ్యలో తెలంగాణకు చెందినవారు ఉండడం గమనార్హం. ఈ కీలకమైన పరీక్షకు 11.70 లక్షల మంది అభ్యర్థులు మొదటి ఎడిషన్కు హాజరయ్యారు.
సోమవారం విడుదలైన JEE Main Exam 2024 ఫలితాలు
తాజాగా, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2024 సెషన్-1 పరీక్షల ఫలితాలను సోమవారం ప్రకటించారు. JEE మెయిన్ 2024 పరీక్ష పేపర్-1 పరీక్షలు జనవరి 27, 29, 30,31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించగా, పేపర్-2 పరీక్ష జనవరి 24న జరిగింది.
100 NTA స్కోర్లు సాధించిన అభ్యర్థుల్లో తెలంగాణ నుంచి ఏడుగురు, హర్యానా నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఢిల్లీ నుంచి ఇద్దరు, గుజరాత్, కర్ణాటక , తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
అయితే, ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిలో తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరపు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డి ఉండగా ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి 100 శాతం స్కోరు సాధించారు.
భారతదేశం వెలుపల JEE Main Exam 2024
JEE మెయిన్ 2024 పరీక్ష అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో జరిగింది. JEE మెయిన్ 2024 పరీక్షను భారతదేశం వెలుపల మనామా, దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్, మరియు వాషింగ్టన్ DC ప్రాంతాలలో కూడా నిర్విహించారు.
Also Read: JEE మెయిన్ ఫైనల్ కీ విడుదల..!