Inter Exam Fee | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్, విద్యార్థులకు సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసింది. డిసెంబర్ 30తో ముగియనున్న ఇంటర్ పరీక్షల ఫీజు గడువును జనవరి 3 వరకు గడువు పొడగిస్తున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం జనరల్, వృత్తి విభాగాల విద్యార్థులు అపరాధ రుసుముతో కలిపి మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని తెలిపింది. మొత్తం 10,59,233 మంది విద్యార్థులు ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నారు. ఇప్పటివరకు 9,77,040 మంది విద్యార్థులు రుసుము చెల్లించారని మిగిలిన వారి కోసం ఫీజు తేదిని పెంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు రూ.2500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది.
Also read: CERC ప్రోగ్రామ్కు ఎంపికైన భారత మహిళా శాస్త్రవేత్త