drugs seized in Pune | పుణె పోలీసులు రూ.1200 కోట్ల విలువైన 600 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పూణే పోలీసులు గత వారంలో వివిధ ప్రాంతాల నుంచి రూ.3,300 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
drugs seized in Pune | పూణే పోలీసులు బుధవారం జరిగిన డ్రగ్స్ పట్టుకునే ఆపరేషన్లో విశ్రాంత్ వాడి (Vishratwadi), కుర్కుంబ్ (Kurkumb) ప్రాంతాల్లో రూ.1200 కోట్ల విలువైన 600 కిలోల MD డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 20న ఢిల్లీలో రూ.800 కోట్ల విలువైన డ్రగ్స్ను పూణే పోలీసులు స్వాధీనం ఢిల్లీలో చేసుకోగా, ఫిబ్రవరి 18న పూణేలోని సోమవార్ పేట్ ప్రాంతంలో 2 కిలోల MD డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పూణే పోలీసుల చర్యకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, వారిపై IPC మరియు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, 1985 యొక్క సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు పూణే జిల్లాలోని కుర్కుంబ్లోని ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి, అక్కడ నుండి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read | MDMA Drugs | ముంబైలో రూ.5.5 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత