Home   »  నేరాలు   »   Crime | 7 ఏళ్ల బాలికపై S.I అత్యాచారం

Crime | 7 ఏళ్ల బాలికపై S.I అత్యాచారం

schedule sirisha

రాజస్థాన్‌ : Crime | రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై సబ్ ఇన్‌స్పెక్టర్ (SI ) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది.

Crime | 4 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ SI

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఏడేళ్ల బాలికపై సబ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన దౌసా జిల్లాలోని లాల్సోట్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుడు భూపేంద్ర సింగ్ మధ్యాహ్నం మైనర్ బాలికను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ నెహ్రా తెలిపారు.

నిందితుడు భూపేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు ఆయన అన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అలాగే నిందితుడు భూపేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసేలోపే స్థానికులు చితకబాదారు.

ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన BJP MP కిరోడి

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) MP కిరోడి లాల్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల అసమర్థ పాలన నిరంకుశంగా వ్యవహరిస్తోందని అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు.

ఎన్నికల వంటి సున్నితమైన సమయంలోనూ పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడడం మానుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘లాల్సోట్‌లో దళిత బాలికపై ఎస్‌ఐ అత్యాచారం చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ చిన్నారికి న్యాయం చేయాలని ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.