నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దళిత మహిళ చికిత్స పొందుతూ మృతి (Death) చెందింది. బాధితురాలు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
యువతి మృతి (Death) పై పోలీసుల వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైనారిటీ వర్గానికి చెందిన ఓ యువకుడు మహిళను కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సెప్టెంబర్ 23 శనివారం నాడు యువకుడు బాధితురాలిని తన బైక్ పై బలవంతంగా ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేశాడు.
బాధితురాలు బైక్పై నుంచి దిగేందుకు ప్రయత్నించగా నిందితుడు ఆమెను వెంబడించి అపస్మారక స్థితికి వచ్చే వరకు దాడి చేసాడు. ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న ఆమెను గుర్తించిన గ్రామస్థులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియ జేశారు.
దళిత యువతి చికిత్స పొందుతూ మృతి (Death) చెందింది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చర్యలు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also read : మెడికో విద్యార్థి మృతిపై TS మైనారిటీ కమిషన్ విచారణ