Nallamala Forest | నల్లమల అడవుల్లో మంగళవారం అర్థరాత్రి నుంచి చెలరేగాయి. గత రెండు రోజుల నుంచి అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
ప్రధానాంశాలు
హైదరాబాద్: నల్లమలలోని బూరెడ్డిపల్లి, దోమలపెంట, కొమ్మన్పేట తదితర సెక్షన్లలో మంగళవారం అర్థరాత్రి నుంచి అడవుల్లో మంటలు చెలరేగాయి. గత రెండు రోజుల నుంచి అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
మంటలను ఆర్పిన అటవీశాఖ బృందం | Nallamala Forest
అటవీశాఖ అధికారుల ప్రకారం.. ‘మంగళవారం రాత్రి మంటలు చెలరేగడంతో అటవీ బృందాలు అక్కడికి చేరుకునే సరికి ఆలస్యమైంది దింతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే, మా బృందాలు మంటలు చెలరేగిన స్థానాలకు చేరుకున్నాయి మరియు బ్లోయర్ల సహాయంతో వారు మంటలను ఆర్పగలిగారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది’ అని తెలిపారు. అయితే సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. దీని తర్వాత కొమ్మంపేట, బూరెడ్డిపల్లి బీట్లలో బుధవారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. దాదాపు ఏడు హెక్టార్ల అటవీప్రాంతం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
మంటలపై ఆరాతీసిన కొండా సురేఖ
“ఇద్దరు స్థానికులు చేసిన పని వల్లే ఈ మంటలు చెలరేగాయి. ప్రత్యేక బృందాలు ఇప్పటికీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి మరియు సాధారణ స్థితికి వచ్చే వరకు స్థానాల్లో ఉండాలని ఆదేశించబడ్డాయి” అని ఓ అధికారి తెలిపారు.
నల్లమలలో చెలరేగుతున్న మంటలపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధికారులతో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో అడవుల్లో మంటలు చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read: ‘నంది అవార్డుల’ స్థానంలో ‘గద్దర్ అవార్డులు’: CM రేవంత్ రెడ్డి