Home   »  నేరాలు   »   అత్తని కాల్చి చంపిన అల్లుడు.. ఇదెక్కడి వైనం…

అత్తని కాల్చి చంపిన అల్లుడు.. ఇదెక్కడి వైనం…

schedule sirisha
Mathura: 11 people arrested for killing a person

హన్మకొండ: హనుమకొండ (Hanumakonda) లో దారుణం చోటు చేసుకుంది. గుండ్ల సింగారం ఇందిరమ్మ కాలనీలో ఓ కానిస్టేబుల్ తన అత్తను కాల్చి చంపాడు. డబ్బుల విషయంలో అత్త, అల్లుడి మధ్య గొడవ అయింది. దీంతో విచక్షణ కోల్పోయిన అల్లుడు తన వెంట తెచ్చిన తుపాకీతో ఆమెను కాల్చాడు. దీంతో స్థానికులు అతణ్ని పట్టుకొని కొట్టారు.

Hanumakonda లో అత్తపై కాల్పులు జరిపిన అల్లుడు

గుండ్లిసింగారానికి చెందిన కమల 15 ఏళ్ల క్రితం ప్రసాద్‌కు తన కుమార్తె రమను ఇచ్చి వివాహం జరిపించింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రసాద్‌పై భార్య కేసు పెట్టింది.

అత్తకు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్

ప్రసాద్ మద్యానికి బానిస కావడంతో గత కొంత కాలంగా అతడి భార్య పిల్లలతో కలిసి తన తల్లి వద్దే ఉంటోందని స్థానికులు చెప్పారు. కాగా గతంలో తన అత్తకు రూ.4 లక్షలు అప్పుగా ప్రసాద్ ఇచ్చాడు. బుధవారం ఆమె ఇంటికి వచ్చి డబ్బుల విషయమై అత్త, అల్లుడి మధ్య పెద్ద గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఆవేశానికి లోనైన ప్రసాద్ తన వెంట తెచ్చుకున్న సర్వీస్ రివాల్వర్‌తో అత్త కమలను కాల్చి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు పోగొట్టుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన స్థానికులు అతణ్ని పట్టుకొని కొట్టారు.

రామగుండం లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అల్లుడు

సమాచారం అందుకున్న Hanumakonda పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ప్రసాద్ ను ఎంజీఎం హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.

అత్త పై కాల్చి చంపిన ప్రసాద్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని తోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన రివాల్వర్‌ను ఎక్కడి నుండి తెచ్చాడు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.