హర్యానా | సోనిపట్లోని ‘మేరా గావ్ మేరా దేశ్’ రిసార్ట్లో ఉజ్బెకిస్థాన్ మహిళ మరియు ఢిల్లీ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషాద సంఘటన జరిగింది.
ప్రధానాంశాలు
Haryana crime news | సోనిపట్లోని కమీ గ్రామంలో ఉన్న ‘మేరా గావ్ మేరా దేశ్’ రిసార్ట్లో ఉజ్బెకిస్థాన్కు చెందిన మహిళ, ఢిల్లీకి చెందిన వ్యక్తి సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడిని ఢిల్లీ వ్యక్తిని అశోక్ విహార్ నివాసి హిమాన్షుగా గుర్తించారు.
ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ విభాగం
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు సోనిపట్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కర్మజీత్ తెలిపారు. ఫోరెన్సిక్ విభాగం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం సీసాలు, ఇతర వస్తువుల నమూనాలను సేకరించారు. అంతేకాకుండా, సమాచారం అందుకున్న హిమాన్షు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు (Haryana crime news)
ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో యువకుడు తన విదేశీ స్నేహితురాలితో కలిసి కమి గ్రామంలోని రిసార్ట్కు వెళ్లినట్లు సమాచారం. మరుసటి రోజు ఉదయం వారిద్దరూ గది నుంచి బయటకు రాకపోవడంతో రిసార్ట్ సిబ్బంది అనుమానంతో వారిని పరిశీలించేందుకు ప్రయత్నించగా ఇద్దరూ గదిలో శవమై కనిపించారు. మృతదేహాల గురించి సమాచారం అందుకున్న సోనిపట్ సదర్ పోలీస్ స్టేషన్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read | Rajasthan | మైనర్ బాలికపై పాఠశాల ఉపాధ్యాయుడి అత్యాచారం