Hyderabad Junior artist murder: కోపంతో క్షణాల్లో చంపి జీవితాలను నాశనం చేసుకుంటారు. ప్రేమించిన అమ్మాయి ఎడబాటు వేదనతో వేరొకరితో దగ్గరవుతోందన్న అనుమానంతో హత్యలు చేస్తున్నారు. దాని వల్ల తమ జీవితాలు తర్వాత మారతాయనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు.
వారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది.
తాను ప్రేమించిన అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని ఓ యువకుడు జూనియర్ ఆర్టిస్ట్ను స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం :-
విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన 20 ఏళ్ల సాయి హైదరాబాద్లో ఉంటున్నాడు. యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అతనికి ఓ యువతి పరిచయమైంది. ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తోంది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా సాయి ప్రవర్తన నచ్చక ఆమెను దూరంగా ఉంచింది.
ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా సంకిస గ్రామానికి చెందిన 18 ఏళ్ల కార్తీక్ ఆమెను సంప్రదించాడు. కార్తీక్ హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తున్నాడు.
కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారనే అనుమానంతో చంపాలని నిర్ణయించుకున్నాడు.
యూసుఫ్ గూడలో కార్తీక్ సోదరుడు శంకర్ ఉంటున్న గదికి వెళ్లి మూడు రోజులు గడిపాడు.
ఇది తెలిసిన సాయి తట్టుకోలేకపోయాడు. అందుకే కార్తీక్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కార్తీక్ హత్య ఎలా బయట పడిందంటే :-
గత నెల 13 నుంచి కార్తీక్ కనిపించకపోయే సరికి అతని సోదరుడు శంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు.
సీసీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎంక్వైరీ చేసి సాయి, అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో కార్తీక్ హత్య బయటపడింది.
నలుగురూ కలిసి కార్తీక్ను చంపేసినట్టు విచారణలో అంగీకరించారు.
Hyderabad Junior artist murder ఎలా చేసారంటే :-
విజయనగరం జిల్లా కు చెందిన సురేష్, రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్, సాయి స్నేహితులు. ముగ్గురు స్నేహితుల సాయంతో కార్తీక్ హత్య కు ప్లాన్ చేశాడు సాయి.
గత నెల 13 న రెండు బైక్లపై కార్తీక్ గదికి వెళ్లారు. యువతి దుస్తులు కొన్ని తమ గదిలోనే ఉండి పోయాయని వచ్చి తీసుకెళ్లమని చెప్పాడు.
నిజమే అని నమ్మిన కార్తీక్ వారితో కలిసి బైక్పై వెళ్లాడు. ఓల్డ్ బోయిన్పల్లి ఎయిర్ పోర్ట్ దగ్గర అటవీ ప్రాంతం వైపు కార్తీక్ ను తీసుకెళ్లారు సాయి, అతని ఫ్రెండ్స్.
అక్కడ కార్తీక్పై దాడి చేశారు. చెట్టుకు కట్టేసి కత్తితో పక్కటెముకల్లో పొడిచారు. కత్తి వంకర పోవడంతో బాధితుడిని కింద పడేసి పీకకోసేశారు.
బండ రాయితో తల బద్దలు కొట్టి చంపారు. చనిపోయాడని నిర్ధరించుకున్నాక సాయి, అతని ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు.