మహబూబాబాద్ | మహబూబాబాద్ జిల్లాలో ఓ వృద్ధుడు మరో వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది.
కేవలం రూ.500 కోసం ఓ వృద్ధుడు మరో వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా గూడూరు మండలంలో గురువారం చోటుచేసుకున్నది. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కోబల్తండా గ్రామనికి చెందిన తేజావత్ ఈరమ్మ తండాలో కూలీ పనులు చేస్తూ ఒంటరిగా జీవనం కొనసాగించేది.
కక్ష పెంచుకుని హత్యచేసిన స్వామి (Mahabubabad)
ఆమె భర్త చనిపోగా ఎలాంటి సంతానం లేదు. ఈరమ్మ తన ఇంటి పక్కనే ఉన్న వృద్ధుడు తేజావత్ స్వామికి రూ.500లు అప్పు ఇచ్చింది. డబ్బు తిరిగి ఇవ్వాలని మూడు రోజులుగా ఈరమ్మ స్వామిని అడుగుతుంది. ఆమెపై కక్ష పెంచుకున్న స్వామి బుధవారం రాత్రి ఈరమ్మను గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి అక్క కుమారుడి ఫిర్యాదు మేరకు స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: Suryapet | మద్యం విక్రయిస్తున్న 11 మంది దాబా యజమానులపై కేసు నమోదు