వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి… ఆపై ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది.
ప్రధానాంశాలు
kurnool | వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళ హత్య
వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి.. ఆపై ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. కర్నూలు మూడో పట్టణ C.I మురళీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… నందికొట్కూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే విజయ్కుమార్(35) ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలో నివాసం ఉండే రుక్సానా(45) అనే మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై రుక్సానా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయ్కుమార్, రుక్సానాతో కలిసి కర్నూలులోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. రుక్సానాను కత్తితో పొడిచి హతమార్చాడు.
విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విజయ్కుమార్
శనివారం ఉదయం సిబ్బంది వారిని పిలువగా వారిద్దరూ ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టారు. గదిలో రుక్సానా, విజయ్కుమార్ రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయ్కుమార్, రుక్సానాను కత్తితో పొడిచి, అనంతరం అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాస్త చేస్తున్నట్లు వివరించారు.
Also Read: Odisha: ఒడిశాలోని ఇటుక బట్టీలో ఊపిరాడక ఇద్దరు మృతి