Home   »  నేరాలు   »   Man who killed a friend: స్నేహితుడిని చంపి ఇంట్లో సమాధి చేసిన యువకుడు

Man who killed a friend: స్నేహితుడిని చంపి ఇంట్లో సమాధి చేసిన యువకుడు

schedule ranjith

Man who killed a friend | తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. ఆ తర్వాత తలను, దేహాన్ని వేరు చేసి తన ఇంట్లోనే పాతిపెట్టాడు. పోలీసులు CCTV ఫుటేజ్ ఆధారంగా విచారించగా అసలు విషయం బయటపడింది.

man who killed a friend: A young man who killed a friend and buried him at home

కుంభకోణంలోని చోళాపురం ప్రాంతానికి చెందిన అశోక్‌రాజ్(Man who killed a friend)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంభకోణంలోని చోళాపురం ప్రాంతానికి చెందిన అశోక్‌రాజ్ (27) అనే యువకుడు అక్టోబర్ 13 నుంచి కనిపించకుండా పోయాడు. అతని తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా, తల్లి విదేశాల్లో ఉంటోంది. దాంతో అశోక్‌రాజ్ అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడు. అయితే అతడు హఠాత్తుగా కనిపించకపోవడంతో అశోక్‌రాజ్ అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువకుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

యువకుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు చోళాపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న CCTV ఫుటేజీలను పరిశీలించారు అధికారులు. ఆ సమయంలో చోళపురం తూర్పురోడ్డు వైపు అశోక్‌రాజ్ వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత CCTV ఫుటేజీ ఆధారంగా యువకుడికి స్నేహితుడైన 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ సమయంలో యువకుడిని హత్య చేసి తన ఇంట్లో పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Gujarat Road Accident: గుజరాత్‌లోని పంచమహల్ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి.. 11 మంది గాయాలు