నిర్మల్ | నిర్మల్ (Nirmal)జిల్లా ఖానాపూర్లో హత్య కలకలం రేపింది. నడిరోడ్డుపై ప్రియురాలని హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు.
ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన ముగ్గురుపై అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అలేఖ్య వదిన జయ(25), జయ కొడుకు రియాన్ష్(3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయ, రియాన్ష్ ఖానాపూర్ మార్కెట్కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ కాపు కాసి దాడి చేశాడు.
Also read: Kamalapur | నేరెళ్ల గ్రామంలో దొంగల హల్చల్