Home   »  నేరాలు   »   Nizamabad crime news: నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు..!!

Nizamabad crime news: నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు..!!

schedule ranjith

నిజామాబాద్ జిల్లాలో వరుస హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు.

Nizamabad crime news: Serial murders in Nizamabad district..!!

స్నేహితుడే హత్య చేసినట్లుగా ఆరోపణలు (Nizamabad crime news)

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడింది స్నేహితుడేనని అనుమానిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లారుకు చెందిన మాక్లూర్ ప్రసాద్‌ కుటుంబానికి చెందిన వారంతా హత్యకు గురైనట్లుగా చెబుతున్నారు. ప్రసాద్‌ కుటుంబాన్ని అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా సమాచారం.

ప్రసాద్, అతని భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ల హత్య

వివరాలలోకి వెళితే… ప్రశాంత్ తన స్నేహితుడు మాక్లూర్ ప్రసాద్‌ ను హత్యచేసి, శవాన్ని డిచ్‌పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి, అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకు వెళ్లాడు. బాసర వద్ద గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత వారి ఇద్దరి పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలోశవాలను పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి… ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకువెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు. అయితే ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Also Read: Mexico: మెక్సికోలో దారుణం.. ఓ దుండగుడి కాల్పుల్లో 16 మంది మృతి