Pani Puri | జంగారెడ్డిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ తిన్న ఇద్దరు సోదరులు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిన ఘటన అందరిని దుఃఖ సాగరానికి గురిచేసింది.
Pani Puri | ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ తిన్న ఇద్దరు సోదరులు వెలపాటి రామకృష్ణ(10), విజయ్(6) వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. వారి మృతికి ఫుడ్ పాయిజనే కారణమని వైద్యులు తెలిపారు.
ముందుగా విజయ్కి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా విజయ్ మార్గమధయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పోలిసుల వివరాల ప్రకారం… రాత్రి ఇద్దరు అన్నదమ్ములు పట్టణంలోని నిర్మల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఓ పానీపూరీ బండి దగ్గర పానీ పూరీ తిన్నారని తండ్రి రవి తెలిపాడు. పానీపూరీ వల్లే ఫుడ్ పాయిజన్ జరిగి తన ఇద్దరు కుమారులు చనిపోయారని రవి ఆరోపిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Punjab Crime News | భర్తను హతమార్చిన భార్య