హైదరాబాద్: Smuggling దందాలో ఇప్పటి దాకా మగవారు పట్టుబడడం మాత్రమే మనం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఓ యువతి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.
వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు.
దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్ఎస్డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం :-
మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని అన్నారు.
డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని ఈమెకు వివాహం జరిగిందని తెలిపారు. అయితే భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు.
గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసిందని, నగరానికి తీసుకువచ్చి డిమాండ్ను బట్టి గ్రాము రూ.20 వేలకు పైగా అమ్మిందని తెలిపారు.
డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించినట్లుగా పోలీసులు చెప్పారు.
అంతేకాక ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని వెల్లడించారు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని వారి మూడు వాహనాలు సీజ్ చేసినట్లుగా చెప్పారు.
వారి ఫోన్లు కూడా సీజ్ చేశామని వెల్లడించారు. అందులో వారి కస్టమర్లకు సంబంధించి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు.
వారి Smuggling నెట్ వర్క్పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని వివరించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు.