ప్రధానాంశాలు
రాజస్థాన్: భూమిపై యాజమాన్య హక్కులపై ఇరు కుటుంబాల మధ్య వివాదం జరుగుతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాళ్లు, కర్రలతో కొట్టారు. ఆపై వరుసకు తమ్ముడిని ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడు. రాజస్థాన్ (Rajasthan) లోని భరత్పూర్లో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఘటన Rajasthan లోని భరత్పూర్లో చోటుచేసుకున్న ఘటన
బహదూర్ సింగ్, అథర్ సింగ్ కుటుంబాలు భరత్పూర్లోని భూమిపై కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య గతంలోనూ పలుమార్లు గొడవలు పెట్టుకున్నారు. ఇదే అంశం పై 25బుధవారం రోజున మరోసారి పంచాయతీ జరిగింది. బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్ పై వచ్చారు, అథర్ సింగ్ కుటుంబం అక్కడికి రాగానే వెంటనే, కొట్లాట ప్రారంభమైంది.
ట్రాక్టర్తో తొక్కి చంపేశాడు
ఇరువర్గాలు పోట్లాడుకున్నారు. ఈ గొడవలో అథర్ సింగ్ కుమారుడు నిర్పత్ కిందపడిపోగా.. బహదూర్ సింగ్ తమ్ముడి పైకి ట్రాక్టర్ తో ఎనిమిది సార్లు వెనక్కి ముందుకు వెళ్లాడు. మిగతావారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపలేదు. తీవ్ర గాయాలపాలైన నిర్పత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇరు కుటుంబాలకు చెందిన 10 మంది గాయాలు
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన 10 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల్లోనే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత అథర్ సింగ్ కుటుంబం బహదూర్ సింగ్ కుటుంబంపై కేసు పెట్టిందని పోలీసులు చెప్పారు.
Also Read: మైనే సామూహిక కాల్పుల్లో కనీసం 22 మంది మృతి