ఆంధ్రప్రదేశ్ | ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు ఓ కానిస్టేబుల్ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Red sandalwood smugglers | కంభంవారిపల్లె మండలం చీనేపల్లి గ్రామంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ సోమవారం రాత్రి సోదాలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎర్రచందనం తీసుకెళ్తున్న కారును ఒక కానిస్టేబుల్ గుర్తించి, డ్రైవర్ను ఆపమని సిగ్నల్ ఇచ్చాడు. అయితే స్మగ్లర్లు కారును ఆపకుండా అతడిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతిచెందిన కానిస్టేబుల్ ను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (APSP) 14వ బెటాలియన్కు చెందిన గణేష్గా గుర్తించారు.
అన్నమయ్య జిల్లా చీనెపల్లె వద్ద దారుణం (Red sandalwood smugglers)
ఈ ఘటన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేసి కారుతో పాటు ఇద్దరు స్మగ్లర్లను పట్టుకుని ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న రాయలసీమ ప్రాంతం ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రసిద్ధి చెందింది. అవిభాజ్య చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో ఉన్న శేషాచలం అటవీప్రాంతం అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆగడాలకు గురవుతోంది. 2022లో టాస్క్ ఫోర్స్ 73 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి 50 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకుంది.
Also Read: నాయుడుపేటలో రూ. 4.31 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టుకున్న పోలీసులు