బెంగళూరు: షాకింగ్ సంఘటనలో బెంగళూరు మహిళకు పార్ట్టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసగాళ్లు స్కామ్ (Scam) చేసి రూ.60 లక్షలు తీసుకొని మోసం చేశారు.
మహిళ (27) నగరంలోని సర్జాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది. సెప్టెంబర్ 11-19 మధ్యలో ఆమె డబ్బు పోగొట్టుకుంది.
ఈ స్కామ్(Scam) లో బెంగుళూర్ మహిళా
పార్ట్టైమ్ ఉద్యోగం గురించి ఆమెకు ఫోన్ కు లింక్తో కూడిన ఒక msg వచ్చింది. క్లిక్ చేయడంతో ఆమెను టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయ్యింది. అక్కడ ఆమె హోటల్లను సమీక్షించండి దాని వల్ల రూ. 100 సంపాదించవచ్చని చెప్పారు.
ప్రారంభంలో హోటల్లను సమీక్షించినందుకు మహిళకు తక్కువ డబ్బులు వచ్చాయి. అయితే తర్వాత స్కామర్లు ఆమెకు మంచి బక్స్ సంపాదించడంలో సహాయపడే పెట్టుబడి అవకాశం గురించి తెలిపారు.
ఆ మహిళ పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. కాగా ఆమె ఖాతా నుండే కాకుండా ఆమె అత్తగారి ఖాతా నుండి డబ్బును తీసుకుంది. మొదట్లో తన పెట్టుబడికి కొంత లాభం వచ్చింది.
దీంతో ఆమె మరింత ఎక్కువ మొత్తం అంటే రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టింది. అయితే ఈ సారి తన డబ్బులు తిరిగి వెనక్కి రాలేదు. కాగా ఆమెకు పార్ట్టైమ్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అప్పుడు తానకి అర్థమైంది మోసపోయానని. వెంటనే ఆమె సైబర్ పోలీసులకు సమాచారం అందించింది.