హైదరాబాద్ | సికింద్రాబాద్లోని మొండా మార్కెట్, మారేడ్పల్లి సమీపంలో యాచకుడి హత్య కలకలం రేపింది.
ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకుడిపై దాడి (Secunderabad)
సికింద్రాబాద్లో (Secunderabad) ఆదివారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చేసిన రెండు వేర్వేరు దాడుల్లో ఒక యాచకుడిని దారుణంగా హత్య చేయగా, మరొకరికి గాయాలయ్యాయి. మొండా మార్కెట్ సమీపంలోని ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వారు అతనిని కత్తితో పొడిచి చంపారు. మారేడ్పల్లిలో ఘటనలో మరో యాచకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మొండా మార్కెట్, మారేడ్పల్లి పోలీస్స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా CCTV ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ రెండు ఘటనల్లోనూ ఇతర యాచకుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Madhya Pradesh | BJP నాయకుడి ఇంట్లో చోరీ.. ఇద్దరు దంపతుల హత్య