GHMC Workers | GHMC సిబ్బంది శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని సులేమాన్ నగర్ లో క్లీనింగ్కు వెళ్లారు. అక్కడ ఫుట్ పాత్ పై కొబ్బరి బొండాలు అమ్మొద్దని, ఫుట్ పాత్ ఖాళీ చేయాలని చెప్పిన GHMC సిబ్బందిపై ఓ వ్యాపారి రాళ్లతో దాడి చేశాడు. ఇటుకలతో GHMC సిబ్బందిని కొడుతూ హంగామా సృష్టించాడు. వ్యాపారితో పాటు మరో ముగ్గురు కుర్రాళ్లు కూడా దాడి చేశారు. ఇదంతా GHMC సిబ్బంది ఒకరు వీడియో తీసి పోలీసులకు అందజేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, కొబ్బరి బొండాల వ్యాపారితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
Also Read | BRS బస్సుపై NSUI కాంగ్రెస్ కార్యకర్తల దాడి..!