Home   »  నేరాలు   »   Warangal Crime news | ప్రాణం తీసిన అగ్గిపెట్టె గొడవ

Warangal Crime news | ప్రాణం తీసిన అగ్గిపెట్టె గొడవ

schedule ranjith

వరంగల్ | అగ్గిపెట్టి కోసం ఇరువర్గాలు కొట్టుకుని ప్రాణాలు తీసేందుకు తెగబడిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలోని ZPHS ప్రభుత్వ పాఠశాలలో యువకుల మధ్య ఘర్షణలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Warangal Crime news | A match that took a life

Warangal Crime news | వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలోని ZPHS పాఠశాలలో యువకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అగ్గిపెట్ట కోసం రెండు వర్గాలకు చెందిన యువకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త కొట్టుకునేంత వరకు దారితీసింది. ఓ వర్గానికి చెందిన యువకుడు బీరు సీసాతో తలపై కొట్టడంతో భేతి రామ్ చరణ్ (17) స్పృహ తప్పి కింద పడిపోయాడు. స్పృహ తప్పి ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి రామ్ చరణ్ మృతి చెందాడు. మృతుడు పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన భేతి శోభా, వెంకటేష్ కుమారుడు రామ్ చరణ్ గా గుర్తించారు.

రాయపర్తి మండలం కొలనుపెల్లి గ్రామంలో విషాదం (Warangal Crime news)

సంక్రాంతి పండుగ సెలువులలో అమ్మమ్మ ఇంటికి రామ్ చరణ్ వచ్చాడు. వరంగల్ లోని ఓ కళాశాలలో రామ్ చరణ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రామ్ చరణ్ మృతితో కుటుంబ సభ్యులు బాధలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుల మధ్య గొడవ కేవలం అగ్గిపెట్టి కోసమేనా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ZPHS పాఠశాలలోని యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని పోలీస్ అధికారులు తెలిపారు.

Also Read: IIT Student Suicide | IIT-కాన్పూర్‌లో విద్యార్థిని ఆత్యహత్య