Bangalore | కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఇంట్లో నగ్నంగా పడివున్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.
ప్రధానాంశాలు
Bangalore | కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఐదు రోజుల క్రితం ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన సపన్కుమార్ నగర శివారులోని చందాపుర హెడ్మాస్టర్ లేఔట్లో నాలుగో అంతస్తులో నివసిస్తున్నాడు. ఆయనతో కలిసి కొంతకాలంగా 28 ఏళ్ల మహిళ అక్కడే ఉంటోంది.
ఐదు రోజులుగా తెరుచుకోని ఇంటి తలుపులు
హత్యకు ముందు వారిద్దరూ కలిసి మద్యం తాగినట్టు ఇంట్లోని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మృతదేహం చుట్టుపక్కల మద్యం సీసాలు, సిగరెట్లు పడివున్నాయి. ఐదు రోజుల నుంచి ఇంటి తలుపులు తెరుచుకోకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Bangalore | ఇంట్లో నగ్నంగా పడివున్న మహిళ
తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నగ్నంగా పడివున్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటన తర్వాతి నుంచి సపన్కుమార్ కనిపించడం లేదు. అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్లో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also Read | మెట్పల్లిలో దొంగల బీభత్సం