హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ను స్థాపించడానికి జీవో జారీ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం.
జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భోంగీర్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఆరోగ్య తెలంగాణ కింద మెడికల్ కాలేజీలు వస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు తెలిపారు.
“ఈ కొత్త కళాశాలలు విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించడానికి, ప్రతి జిల్లాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత మెరుగుపరచడానికి మెరుగైన అవకాశాలను అందిస్తాయి” అని రావు చెప్పారు.
మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సబిత ఇందిరా రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.