Pushpa The Rule | టాలీవుడ్తో పాటు గ్లోబల్ ఇండస్ట్రీ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో తెరకెక్కిన పుష్ప.. ది రైజ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ సినిమాతో ఐకాన్ స్టార్గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో మరోసారి ట్రెండ్ సెట్ చేసేందుకు వస్తున్నాడు అల్లు అర్జున్.
Also Read: పుష్ప2 రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే.?
పుష్ప 2’ రిలీజ్ డేట్
2021లో విడుదల అయిన ‘పుష్ప: ది రైజ్’కు డైరెక్ట్ సీక్వెల్గా ఈ సినిమా రానుంది. ‘పుష్ప 2’ ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఆ ఆసక్తికి తెరదించుతూ రిలీజ్ డేట్ను నిర్మాతలు విడుదల చేశారు.
2024 ఆగస్టు 15వ తేదీన ‘పుష్ప 2: ది రూల్’ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
బన్నీ, దేవిశ్రీ ప్రసాద్ కి నేషనల్ అవార్డులు రావడంతో పుష్ప ది రూల్ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో మూవీ చుట్టూ చాలా రకాలా రూమర్స్ అలుముకుంటున్నారు. గతంలో సాయి పల్లవిని ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
అందులో వాస్తవం లేదని తేలిపోయింది. తాజాగా ప్రియమణిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Also Read: “పుష్ప2” టోటల్ రైట్స్కు రూ.1000 కోట్ల ఆఫర్?
‘పుష్ప-2’ సినిమాలో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
తాజాగా ప్రియమణి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఆమె నటించిన షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ప్రియమణి పుష్పలో నటించడంపై రియాక్ట్ అయ్యారు. పుష్ప టీమ్ నుంచి తనని ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఆ సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఒక వేళ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే వదులుకోనని స్పష్టం చేశారు.
దీంతో పుష్ప 2 మూవీలో ప్రియమణి నటిస్తోందనే వార్తలకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీపై బజ్ ఉన్న నేపథ్యంలో ఇతర భాషలకి చెందిన నటీనటులని కూడా ఈ చిత్రం కోసం సుకుమార్ ఎంపిక చేసాడని అందరూ భావించారు.
అయితే కథ డిమాండ్ మేరకు పాత్రలు కూడా ఉంటాయని తెలుస్తోంది. మొదటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ పార్ట్ 2లో కూడా కొనసాగుతున్నాయంట.
Also Read: pushpa 2: “పుష్ప-2′ షూటింగ్ స్పాట్ లీక్!
పోస్ట్ ప్రొడక్షన్
ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేశారట. చాలా వరకు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నిజానికి ఈ ఏడాది చివర్లోనే ‘పుష్ఫ 2’ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సినిమాపై మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.