లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కాంబోలో తెరకెక్కిన “ఖుషి” సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. హైదరాబాద్లోని పార్క్ హయత్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ శివ నిర్వహణ లో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఖుషి నుంచి వచ్చిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన స్వరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్కు ముందు ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ను తెచ్చిపెట్టాయి.
ఈ ట్రైలర్.. దీనమ్మ కాశ్మీర్ సేమ్ రోజా సినిమాలానే ఉంది.. అంటూ విజయ్ చెప్పిన డైలాగ్తో ట్రైలర్ అద్భుతంగా ఓపెన్ చేశారు. ఇక హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ విజయ్ చేసిన కామెడీ ట్రైలర్కు హైలెట్ అయింది. ఇక తాను బేగం కాదు.. బ్రాహ్మిణ్ అంటూ అసలు విషయాన్ని, అసలు చిక్కుని చూపించారు. ప్రేమ, పెళ్లి, గొడవల నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు.