Home   »  జాతీయం   »   ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

schedule raju

బెంగళూరు రైల్వేస్టేషన్లో ప్రమాదం తప్పింది. ఈ ఉదయం బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న(కెఎస్ఆర్)లో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 5.45 గంటలకు రైలు నుంచి ప్రయాణికులు దిగిపోగా, 7.10 గంటలకు రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పొగలు దట్టంగా వ్యాపించాయి. ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని అధికారులుతెలిపారు.

రైల్వేస్టేషన్లో మొత్తం దట్టమైన పొగ ముసురుకుంది. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన పని లేదని హామీ ఇస్తున్నారు. మంటలు ఎందుకు వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.