Home   »  జాతీయం   »   గ్యాస్‌ లీకై ఐదుగురు కార్మికులు మృతి

గ్యాస్‌ లీకై ఐదుగురు కార్మికులు మృతి

schedule ranjith

మధ్యప్రదేశ్‌ లో విషాదం చోటు చేసుకుంది. మొరెనా జిల్లాలోని ఆహార పరిశ్రమలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో విష వాయువులు లీక్‌ కావడంతో.. మరమ్మతులు చేసేందుకు వెళ్లిన ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా.. ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఫ్యాక్టరీలోని ట్యాంకును శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలు మొదట అందులోకి దిగారని తోటి కార్మికులు తెలిపారు. శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువు లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు కార్మికులు వారిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగారు. వారు సైతం విషవాయును పీల్చడంతో మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సోదరులు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.