చైనా: వైద్యులే ఆశ్చర్యపోయే వింత ఘటన చైనా లో చోటు చేసుకుంది. హువాంగ్ యిజున్ అనే మహిళ 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే పిండం గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని అబార్హన్ చేయించుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ ఆమెది నిరుపేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో ఆమె చేయించుకోలేదు.
ఆ తర్వాత ఆమె ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళలేదు అని చెప్పారు. ఇప్పుడు ఆమెకు 92 ఏళ్ల, ఈ వయసులో తన ఆరోగ్య రీత్యా ఆసుపత్రికి వెళ్లగా ఆమెను పరీక్షించిన వైద్యులే కంగుతిన్నారు. తాను ఇప్పటికి కడుపుతో ఉందని డాక్టర్లకు అర్థమైంది. చివరికి శస్త్ర చికిత్స రాయి లాగా మారిన బేబీ ని బయటకు తీశారు.