Earthquake in Andaman Nicobar |అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7.53 గంటల ప్రాంతంలో 4.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి.
Earthquake in Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం 7.53 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అక్షాంశం: 12.66 & రేఖాంశం: 93.02 ల వద్ద, భూమికి 10 km లోతున భూకంప కేంద్రంను గుర్తించినట్లు వెల్లడించింది.
ఇటీవల భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొత్త సంవత్సరం వేళ జపాన్లో వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ భూకంపం కారణంగా 200 మందికి పైగా ప్రజలు మరణించారు. దాదాపు 565 మంది గాయపడ్డారు.
Also read: జపాన్లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం.. మృతుల సంఖ్య 57కి చేరింది.