Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ మరోసారి రెచ్చిపోయారు. బ్రిటన్, అమెరికాకు సంబంధించిన వాణిజ్య నౌకలపై దాడి చేశారు.
హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయారు. అమెరికా, బ్రిటన్కు సంబంధించిన వాణిజ్య నౌకలపై దాడి చేశారు. ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీలు ప్రకటించారు. తొలుత అమెరికా నౌక స్టార్ ఆసియా, అనంతరం బ్రిటన్ నౌక మార్నింగ్ టైడ్పై యాంటీ పిప్ మిస్సైల్స్తో దాడి చేశారు. ఈ దాడిలో యూకే నౌక స్వల్పంగా దెబ్బతినగా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు యూఎస్-యూకే దళాలు హౌతీలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.
Also Read | అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని..!