Canada | కెనడాలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటారియో ప్రావిన్స్లోని వారి నివాసంలో మంటలు చెలరేగడంతో వారు చనిపోయారు. మార్చి 7న ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లో వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Canada | మంటలలో సజీవ దహనమైన కుటుంబం
మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించిన అనంతరం మృతులను రాజీవ్ వరికూ (51), భార్య శిల్ప (47), వారి కుమార్తె మహెక్ వరికూ (16)గా పోలీసులు గుర్తించారు. కాగా, రాజీవ్ ఇంట్లో మంటలు చెలరేగడానికి ముందు పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించినట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. దీంతో ఈ ఘటనపై అగ్నిమాపక విభాగం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒంటారియో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read | చైనాలో భారీ పేలుడు.. చెల్లా చెదురుగా భవనాల శిథిలాలు..