Junior NTR | జపాన్ ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. వరుస భూకంపాల ఘటనపై టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ NTR తాజాగా స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రధానాంశాలు
జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న Junior NTR
షూటింగ్కు విరామం లభించడంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను ఫ్యామిలీతో కలిసి జరుపుకునేందుకు జపాన్కు వెళ్లిన జూనియర్ NTR తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. తీవ్ర భూకంపం సంభవించిన కొన్ని గంటల ముందు ఆయన బయలుదేరి స్వదేశానికి వచ్చేశాడు. తీవ్ర భూకంపం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ మేరకు NTR ‘X’ వేదికగా స్పందించాడు.
గత వారమంతా ఫ్యామిలీతో జపాన్ లోనే గడిపానన్న ఎన్టీఆర్
N.T.R గతవారం కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తారక్ జపాన్లో వారం రోజులపాటు గడిపారు. ఇక టూర్ ముగించుకొని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఇంతలోనే అక్కడ వరుస భూకంపాలు సంభవించాయన్న విషయం తెలుసుకున్న N.T.R సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చాను. గతవారం అంతా అక్కడే గడిపాను. జపాన్లో భూకంపం వార్త విని షాక్ అయ్యాను. ఆ ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
దేవర సినిమా గురించిన సమాచారం
ప్రస్తుతం N.T.R.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే 80 శాతం మేర చిత్రీకరణ పూర్తయింది. దేవరలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read: Japan: జపాన్ లో తీవ్ర భూకంపం.. హెచ్చరికలు జారీచేసిన ప్రభుత్వం