Hindu Temple: ఖలిస్థానీ తీవ్రవాదుల (Khalistan terrorists) ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అమెరికా, కాలిఫోర్నియాలోని ఓ హిందూ దేవాలయంపై మరోసారి దాడికి తెగబడ్డారు.
మరోసారి రెచ్చిపోయిన Khalistan terrorists
హేవార్డ్లోని షెరావాలి దేవాలయ గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలతో విధ్వంసానికి తెగబడ్డారు. భారత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాసారు. మోదీ ఉగ్రవాది, ఖలిస్థానీ జిందాబాద్ అని రాసారు. గోడలపై ఉన్న గ్రాఫిటీ ఫోటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ట్విట్టర్ X ఖాతాలో పోస్ట్ చేసారు.
హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ కు మద్దతుగా రాతలు
కాగా గత సంవత్సరం డిసెంబర్ 23న కాలిఫోర్నియాలోని నెవార్క్లోని స్వామినారాయణ మందిరం గోడలపై ఖలిస్థాన్కు మద్దతుగా వ్యాఖ్యలు రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పలు కామెంట్స్ చేసారు. ఒక్క అమెరికాలోనే కాదు కెనడా, ఆస్ట్రేలియా, UKల్లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై ఖలిస్థానీ తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.