Home   »  అంతర్జాతీయం   »   నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

నేడు అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

schedule mahesh

Hindhu temple | ప్రస్తుతం UAE, ఖతార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు UAE రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించబోతున్నారు. అబుదాబిలో ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది.

pm-modi-will-inaugarate-hidhu-temple-in-abudabi

Hindhu temple | ప్రస్తుతం UAE , ఖతార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు UAE రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ దేవాలయం భారీ విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయం పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందనుంది.

UAEలో UPI రూపే కార్డ్ సేవలను ప్రారంభించిన ప్రధాని

కాగా UAE, ఖతార్‌ పర్యటనల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రత్యేక విమానంలో భారత్‌ నుంచి బయలుదేరారు. మంగళవారం సాయంత్రం అబుదాబి చేరుకున్న ప్రధాని UAE అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌తో సమావేశమయ్యారు. వీరు ఇద్దరు ద్వైపాక్షిక అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం ప్రధాని మోదీ, మహ్మద్ బిన్ జాయెద్‌తో కలిసి UAEలో UPI రూపే కార్డ్ సేవలను ప్రారంభించడం జరిగింది.

నేడు ప్రధాని మోదీ UAE పర్యటన ముగించుకుని ఖతార్ వెళ్లనున్నారు. ఖతార్‌లో పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఖతార్‌ పర్యటన అనంతరం ప్రధాని తిరిగి భారత్‌కు చేరుకుంటారు.

Also Read | కెనడాలో మరో సిక్కు వేర్పాటువాది ఇంటిపై కాల్పులు..!