హైదరాబాద్లో దక్షిణ మధ్య రైల్వే మరమ్మతుల కారణంగా ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి-నాంపల్లి, లింగంపల్లి-ఫలక్నుమా, ఉందానగర్-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కూడా నిర్వహణ పనుల నిమిత్తం నేటి నుండి 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దయ్యాయి.
సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖ-మచిలీపట్నం రైలు (5-10), విశాఖ-GNT(6-11), విశాఖ-BZA, BZA-విశాఖ ఉదయ్ ఎక్స్ప్రెస్ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేశారు. GNT-రాయగడ, MTM-VSKP, VSKP-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్లను నేటి నుండి ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖ జన్మభూమి, రాయగడ-గుంటూరు, రత్నాచల్లను ఈ నెల 10 వరకు రద్దు చేసినట్లు తెలిపారు.