ఢిల్లీ | ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్ ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. పెయింట్ ఫ్యాక్టరీ వద్ద అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
Fire Breaks | న్యూఢిల్లీలోని అలీపూర్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న పెయింట్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు విపరీతంగా చెలరేగడంతో చుట్టుపక్కల ఇళ్లలో పొగలు కమ్ముకోవడం ద్వారా జనం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఫ్యాక్టరీ సమీపంలోని కొన్ని దుకాణాలు, ఇళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఫ్యాక్టరీలో పని చేసే కూలీలే కాకుండా మరికొంత మంది మృతి చెందారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి మంటలు బాగా వ్యాపించడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 11 మంది మృతి చెందగా నలుగురు గాయపడ్డారని, ఇంకా ఇద్దరు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని ఉండవచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.
Also Read | Fire Accident | హైదరాబాద్ శివార్లలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం..