ఢిల్లీ: పంజాబ్ లో BSF, పంజాబ్ పోలీసులు ఫిరోజ్పూర్లో డ్రోన్ సహాయంతో తరలిస్తున్న 3.4 కిలోల హెరాయిన్తో కూడిన ప్యాకెట్ను, విరిగిన డ్రోన్ను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫిరోజ్పూర్ జిల్లాలోని హజారా సింగ్ వాలా గ్రామ శివార్లలో బుధవారం BSF, పంజాబ్ పోలీసులు కలిసి చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సీనియర్ BSF అధికారి తెలిపారు. ఆపరేషన్ సమయంలో నారింజ రంగు పాలిథిన్లో చుట్టబడిన హెరాయిన్ ప్యాకెట్తో పాటు విరిగిన డ్రోన్ను దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
3.4 కిలోల హెరాయిన్ పట్టివేత..!
Related News
Also Read