Home   »  జాతీయం   »   కర్ణాటకలో కలకలం రేపుతున్న 5 అస్థిపంజరాలు

కర్ణాటకలో కలకలం రేపుతున్న 5 అస్థిపంజరాలు

schedule sirisha

కర్ణాటకలో ఓ ఇంట్లో 5 అస్థిపంజరాలు లభ్యమయ్యాయన్న వార్త కర్ణాటక (Karnataka) లో కలకలం రేపింది. ఈ ఐదుగురు చివరిసారిగా 2019లో కనిపించినట్లు తెలుస్తోంది.

5 skeletons causing stir in Karnataka

కర్ణాటక : Karnataka | కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 2019లో అదృశ్యమైన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో వెలుగు చూసింది. కొన్నేళ్ల క్రితం వరకు ఆ ప్రాంతంలో ఓ కుటుంబం నివసించేది. కుటుంబ సభ్యులు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదని, అందరికి దూరంగా ఉండేవాళ్ళు అని సమాచారం. కుటుంబంలో అందరూ చాలాకాలం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు.

Karnataka | 2019 జూలై తర్వాత అదృశ్యమైన కుటుంబం

ఇదిలా ఉండగా 2019 జూలై తర్వాత ఆ ఐదుగురు కనిపించలేదు. ఇంటి తలుపు కూడా తాళం వేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు భావించారని తెలిపారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రెండు నెలల క్రితం.. మార్నింగ్ వాక్ కు వెళ్లిన కొందరు స్థానికులు ఆ ఇంటి వైపు చూశారు. ఇంటి తలుపులు స్వల్పంగా విరిగిపోయి ఉన్నాయి. అయితే వారికి ఎలాంటి అనుమానాలు కలుగలేదు. పాత ఇల్లే కదా అని ఆ ఇంటిని ఎవరు పట్టించుకోలేదు.

కొద్ది రోజుల క్రితం ఇంట్లో చాలా చోట్ల రంధ్రాలు పడ్డాయి. పలుచోట్ల ఇల్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఐదు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మంచం మీద రెండు అస్థిపంజరాలు కనిపించగా మరో రెండు నేలపై పడి ఉన్నాయి. మరొకటి మరో గదిలో పోలీసులకు కనిపించాయి.ఈ ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో సమీక్షించి దర్యాప్తు ప్రారంభించారు

Also read: కర్ణాటకలో బాలికపై అత్యాచారం.. ఐదుగురి అరెస్ట్…