ప్రధానాంశాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఈ రోజు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఓ కేసులో కీలక వ్యాఖ్యలు చేసారు. 26 వారాల కడుపుతో వున్నా మహిళా పెట్టుకున్న అభ్యర్థన కేసులో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.
Abortion | శిశువును చంపాలని అనుకుంటున్నారా
ప్రెగ్నెన్సీ (Abortion) తొలగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోర్టు ను కోరుతూ పెట్టుకున్న అభ్యర్థన పై స్పందిస్తూ కోర్టు ఆర్డర్ ద్వారా పర్మిషన్ తీసుకుని శిశువును చంపేయాలనుకుంటున్నార అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మండిపడ్డారు.
త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది
అబార్షన్ అపీల్ గురించి ఆ మహిళతో కేంద్రం తరపున లాయర్ మాట్లాడాలని సుప్రీం కోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళా సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.
డిప్రెషన్తో బాధపడుతున్న బాధిత మహిళ
ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె డిప్రెషన్తో బాధపడుతున్నట్లు ఆ పిటీషన్లో పేర్కొంది. మానసికంగా, ఆర్థికంగా మూడవ శిశువును పెంచే స్థితిలో తాను లేనట్లు ఆమె ఆ పిటీషన్లో తెలియచేసింది.ఈ కేసులో అబార్షన్కు అనుమతి ఇస్తూ అక్టోబర్ 9వ తేదీన కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఎయిమ్స్ వైద్యుల బృందం మాత్రం అబార్షన్ చేయమన్నారు.
జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసులో భిన్న అభిప్రాయాలు వ్యక్తం వ్యక్తం చేసారు. దీంతో ఆ కేసును ఇవాళ సీజే చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. తీర్పును రేపటికి వాయిదా వేశారు.