ముంబైలో 25 ఏళ్ల ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అనుమానస్పదంగా మృతి చెందింది. అంధేరీలో ఉన్న ఫ్లాట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. చత్తీస్గఢ్కు చెందిన రూపా ఓగ్రే ఏప్రిల్ నుంచి ముంబైలో ఉంటుంది. ఎయిర్ ఇండియా కంపెనీలో ఎయిర్ హోస్టెస్గా శిక్షణ పొందుతోంది. ఈ రోజు ఉదయం కుళ్ళిన వాసన వస్తుందని అపార్ట్మెంట్ వాసులు పోలీసులు ఫిర్యాదు చేశారు.
అపార్ట్ మెంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిర్ హోస్టెస్ రూపా ఓగ్రే మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమె గొంతుపై ఎవరో కత్తితో కోసిన గుర్తు ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 4 బృందాలుగా ఏర్పడి హంతకుడి కోసం వెతుకుతున్నారు. శవ పరీక్ష నిమిత్తం రాజావాడి ఆసుపత్రికి తరలించారు.