Home   »  జాతీయం   »   భారత్ జోడో యాత్ర 2.0..!

భారత్ జోడో యాత్ర 2.0..!

schedule mahesh

రాహుల్ గాంధీ: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra 2.0)తో నాయకుడిగా పరిణతి చెందిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మరో యాత్ర చేపట్టబోతున్నారు. హస్తం పార్టీ ఈసారి భారత్ జోడో యాత్ర పేరును భారత్ న్యాయ యాత్రగా మార్చింది.

Bharat Jodo Yatra 2.0

Bharat Jodo Yatra 2.0

ఈ సంక్రాంతికి భారత్ న్యాయ యాత్ర (Bharat Jodo Yatra 2.0) ప్రారంభం కానుంది. ఈ భారత్ న్యాయ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ భారత్ న్యాయ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మొత్తం 6 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయబోతున్నాడు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందనుకున్న తరుణంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి భారత్ న్యాయ యాత్ర ఉంటుందని హస్తం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మణిపూర్ నుండి ముంబై వరకు కొనసాగనున్న భారత్ న్యాయ యాత్ర

ఈ భారత న్యాయ యాత్ర మణిపూర్ నుండి ముంబై వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ భారత్ న్యాయ యాత్ర వచ్చే ఏడాది జనవరి 14న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ప్రారంభమవుతుంది. 75 రోజుల పాటు 14 రాష్ట్రాల్లో 6,200 కి.మీ సాగనుంది. 85 జిల్లాల్లో సభలు నిర్వహించనున్న రాహుల్ గాంధీ మార్చి 30న ముంబై చేరుకుని అక్కడ తన భారత పర్యటన ముగించనున్నారు.

అయితే గతంలో భారత్ జోడో యాత్రగా పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేయడం జరిగింది. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టనున్న యాత్ర అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. గతేడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది. తమిళనాడులోని కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా యాత్ర చేపట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ భారత న్యాయ యాత్రలో నడవడమే కాకుండా బస్సులో కూడా ప్రయాణిస్తామని వెల్లడించింది.

6,200 కి.మీ కొనసాగనున్న భారత్ న్యాయ యాత్ర

మణిపూర్ నుండి ముంబైకి 6,200 కి.మీ మార్గంలో కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వేలాది మందితో పాదయాత్ర చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో బస్సుయాత్ర నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంతకుముందు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి ఘనస్వాగతం లభించింది. ఇది కొనసాగుతుందని హస్తం వర్గాలు తెలిపాయి.

Also Read: రెజ్లర్లకు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ