మహారాష్ట్ర: పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని కొవ్వొత్తుల తయారీ యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు మరియు ఎనిమిది మంది గాయపడ్డారు.
ప్రధానాంశాలు
కొవ్వొత్తుల తయారీ యూనిట్(Candle unit) లో అగ్ని ప్రమాదం
పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని మెరిసే కొవ్వొత్తుల తయారీ యూనిట్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు మరియు ఎనిమిది మంది గాయపడ్డారని సంబంధిత అధికారి తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తలవాడే వద్ద ఉన్న కర్మాగారంలో అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక దళానికి కాల్ వచ్చిందని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ సింగ్ తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది
అగ్ని ప్రమాదం జరిగిన కర్మాగారం సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు ఉపయోగించే మెరిసే కొవ్వొత్తులను తయారుచేస్తుందని ఆయన చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలనికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి కారణం ఇంకా కనుగొనబడలేదు అని కమిషనర్ శేఖర్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను పూణే, పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోని ఆసుపత్రుల్లో చేర్పించినట్లు కమిషనర్ తెలిపారు.
Also Read: fire accident in bus: హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు..